గైయా (పోర్చుగల్): ప్రపంచ యూత్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత్కు మరో పతకం దక్కింది. పోర్చుగల్లో బుధవారం జరిగిన అండర్-19 బాలుర సింగిల్స్ సెమీ ఫైనల్లో పాయస్జైన్ 1-4 (4-11, 12-10, 4-11, 2-11, 1-11)తో జియాంగ్ పెంగ్ (చైనా) చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. మూడో స్థానానికి పరిమితమై కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.