గాంధీనగర్: సొంతగడ్డపై ఆసియా వెయిట్లిఫ్టింగ్ చాంంపియన్షిప్లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. సోమవారం జరిగిన మహిళల 48 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ కోమల్ కోహర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను గైర్హాజరీలో బరిలోకి దిగిన 23 ఏళ్ల కోమల్ స్నాచ్లో 78 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్లో 99 కేజీలు కలిపి మొత్తం 177 కేజీల బరువును ఎత్తి మూడో స్థానంలో నిలిచింది.
జెర్క్ విభాగంలో ఆమె కనబరిచిన ప్రతిభకు గాను వ్యక్తిగతంగా మరో కాంస్య పతకం లభించింది. చైనీస్ తైపీ లిఫ్టర్లు హువాంగ్ యీ చెన్ , ఫాంగ్ వాన్-లింగ్ వరుసగా స్వర్ణం, రజతం సాధించారు.