జెరూసలెం: ఫిడే ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్షిప్లో భారత్ సెమీస్లోకి ప్రవేశించింది. గురువారం ఫ్రాన్స్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో భారత్ 2.5-1.5 తేడాతో విజయం సాధించింది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో టై బ్రేక్లో గెలువడం ద్వారా భారత్ ముందంజ వేసింది. సెమీస్లో ఉజ్బెకిస్థాన్తో టీమ్ఇండియా తలపడుతుంది. క్వార్టర్స్ పోరు విషయానికొస్తే.. నిహాల్ సరీన్.. మౌసార్డ్పై, ఎస్ఎల్ నారాయణన్.. ఫ్రెసినెట్పై గెలిచారు.