న్యూఢిల్లీ: భారత ఫుట్బాల్ జట్టు తమ ర్యాంకింగ్స్ను మరింత మెరుగుపర్చుకుంది. అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య(ఫిఫా) గురువారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో భారత్ 100వ ర్యాంక్లో నిలిచింది.
గత ఐదేండ్ల వ్యవధిలో టాప్-100లో నిలువడం టీమ్ఇండియాకు ఇది తొలిసారి. చివరిసారి అత్యుత్తమంగా 2018లో భారత్ 97వ ర్యాంక్ దక్కించుకుంది.