ఇస్లామాబాద్: ఇండియన్ క్రికెట్పై పాకిస్థాన్ ప్రధాని, ఆ టీమ్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం క్రికెట్ను డబ్బే శాసిస్తోందని, ప్లేయర్స్నే కాదు క్రికెట్ బోర్డుల పరిస్థితీ అలాగే ఉన్నదని ఆయన అన్నారు. ప్రపంచంలో బీసీసీఐ ధనికవంతమైన బోర్డు కాబట్టి.. ప్రపంచ క్రికెట్ను ఇండియానే శాసిస్తోందని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు. క్రికెట్లో డబ్బంతా ఇండియాలోనే ఉంది కాబట్టి.. వాళ్లు ఏం చెబితే అదే ప్రపంచ క్రికెట్లో నడుస్తోందని అన్నారు. వాళ్లు చెప్పిందే చెల్లుతుంది. ఇండియాను కాదనే సాహసం ఎవరూ చేయరు. ఎందుకంటే అక్కడ అంత డబ్బు ఉంది అని ఇమ్రాన్ చెప్పారు.
పాకిస్థాన్ టూర్ నుంచి ఇంగ్లండ్ అర్ధంతరంగా తప్పుకోవడంపై ఇమ్రాన్ తీవ్రంగా స్పందించారు. పాక్లాంటి దేశాలతో ఆడుతూ తామేదో పెద్ద ఉపకారం చేస్తున్నట్లుగా ఇంగ్లండ్ ఫీలవుతోందని, దీనికి కారణం డబ్బేనని ఇమ్రాన్ అన్నారు. ప్రపంచంలో అత్యంత ధనికవంతమైన బోర్డు అయిన బీసీసీఐ విలువ 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.14,489 కోట్లుగా ఉంది.