ఆసియా కప్లో భారత జట్టు కాంస్యం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టోర్నీ ప్రారంభించిన భారత్.. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్ను డ్రా చేసుకుంది. అదే సమయంలో జపాన్పై 5-0తో విజయం సాధించిన మలేషియా ఫైనల్ చేరింది.
దాంతో అధికారికంగా భారత జట్టు ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. మూడో స్థానం కోసం జపాన్తో పోరాడిన భారత జట్టు 1-0తో విజయం సాధించింది. రాజ్ కుమార్ పాల్ ఒక్కడే భారత జట్టు తరఫున గోల్ చేశాడు. దీంతో భారత జట్టు విజయం సాధించి మూడో స్థానంలో టోర్నీ ముగించింది.