Rohit Sharma : మరో రెండు నెలల్లో సొంత గడ్డపై వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) సమరం మొదలవ్వనుంది. ఈ మెగా టోర్నీలో భారత జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) జట్టు వరల్డ్ కప్లో అనుసరించబోయే వ్యూహాల గురించి వివరించాడు. ట్రోఫీ గెలవాలంటే నిలకడగా ఆడడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా రోహిత్ అన్నాడు. వెస్టిండీస్లోని బార్బడోస్ (Barbados)లో వరల్డ్ కప్ ట్రోఫీ టూర్(Cricket World Cup 2023 Trophy Tour)లో పాల్గొన్న హిట్మ్యాన్ ఓపికగా ఉండడం ఎంత అవసరమో చెప్పాడు.
‘ఈసారి మళ్లీ సొంత గడ్డపై వరల్డ్ కప్ ఆడనున్నాం. అందుకు అభిమానులే కాకుండా మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. దాంతో, పరిస్థితుల్ని మాకు తగ్గట్టు మలచుకుంటామని నమ్ముతున్నా. అయితే.. అందుకు చాలా ప్రయాణం చేయాల్సి ఉంది. ఒక్కటి రెండు రోజుల్లో వరల్డ్ కప్ గెలవలేమని మాకూ తెలుసు. నెల, నెలన్నర రోజులు అద్భుతంగా, నిలకడగా ఆడాలి’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
Rohit Sharma takes a trip down memory lane as India gear up with optimism for the upcoming home @cricketworldcup 🤩https://t.co/RTv7RcG0hO
— ICC (@ICC) August 8, 2023
అంతేకాదు ఈ మెగా టోర్నీకి సన్నద్ధం అయ్యేందకు చేయాల్సినదంతా చేస్తున్నామని ఈ స్టార్ ప్లేయర్ అన్నాడు. గత రెండు ప్రపంచ కప్స్లో భారత్ సెమీస్ దాటలేదు. అయితే.. ఈసారి మాత్రం అలా జరగదని, 2011లో మహేంద్ర సింగ్ ధోనీ మాదిరిగా తమ జట్టు విజయవంతం అవుతుందని హిట్మ్యాన్ తెలిపాడు. ఈ సందర్భంగా రోహిత్ 2019 వరల్డ్ కప్ అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. 2019 వరల్డ్ కప్లో నేను ఫుల్ జోష్లో ఉన్నా. తొలి మ్యాచ్లో సెంచరీ కొట్టాను. ఆ తర్వాతి మ్యాచుల్లోనే వంద మార్కు చేరువయ్యాను అని వెల్లడించాడు.
ఈసారి మెగా టోర్నీకి స్ఫూర్తినిచ్చే విషయాలను ప్రస్తావిస్తూ… 1992 వరల్డ్ కప్లో అజయ్ జడేజా(Ajay Jadeja) పట్టిన అలెన్ బోర్డర్ క్యాచ్ను గుర్తు చేసుకున్నాడు. ఆ క్యాచ్ ఇప్పటికీ గుర్తుంది. అప్పటి నుంచి మా జట్టు ఫీల్డింగ్ మారిపోయింది. అలాగే 1999 వరల్డ్ కప్ జ్ఞాపకాల విషయానికొస్తే.. హెర్షలీ గిబ్స్ క్యాచ్ దక్షిణాఫ్రికా ట్రోఫీ కలను కల్లలు చేసింది.
ఇక 2003లో ఒక్క ఫైనల్ తప్పిస్తే టీమిండియా టోర్నీ ఆసాంతం అదరగొట్టింది. సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) అయితే గొప్పగా ఆడాడు. ఆ ప్రపంచ కప్లో రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఏకంగా 5 సెంచరీలతో 648 పరుగులు సాధించాడు. అయితే.. కీలకమైన సెమీఫైనల్లో విఫలమయ్యాడు. మిగతావాళ్లంతా చేతులెత్తేయడంతో న్యూజిలాండ్ చేతిలో ఇండియా అనూహ్యంగా ఓటమి పాలైంది.