మాలె: దక్షిణాసియా ఫుట్బాల్ ఫెడరేషన్(సాఫ్) చాంపియన్షిప్లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య సోమవారం జరిగిన తొలి పోరు 1-1తో ‘డ్రా’గా ముగిసింది. ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత జట్టుకు బంగ్లా గట్టి పోటీనిచ్చింది. భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ (26వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించగా.. బంగ్లా తరఫున యాసిర్ అరాఫత్ (74వ నిమిషంలో) ఒక గోల్ నమోదు చేశాడు. తొలి అర్ధభాగంలో పూర్తి ఆధిపత్యం కనబర్చిన భారత్.. ద్వితీయార్ధంలో ఆ జోరును కొనసాగించలేకపోయింది.