మునిచ్: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో జర్మనీ వేదికగా ముగిసిన వరల్డ్కప్ రైఫిల్/పిస్టల్ టోర్నీలో భారత్ రెండు పతకాలు సాధించింది. శుక్రవారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ (3పీ)లో భారత షూటర్ సిఫ్ట్కౌర్ సమ్రా కాంస్యం సాధించింది.
ఇదే టోర్నీలో భాగంగా గురువారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్లో సరబ్జ్యోత్ సింగ్ పసిడి నెగ్గాడు.