సిట్జెస్(స్పెయిన్): ఫిడే మహిళల ప్రపంచ చెస్ చాంపియన్షిప్లో భారత జట్టు తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జార్జియాతో జరిగిన సెమీఫైనల్ పోరులో భారత్ 2.5-1.5 తేడాతో అద్భుత విజయం సాధించింది. సెమీస్ తొలి రౌండ్ గేమ్ను 2-2తో డ్రా చేసుకున్న భారత రెండో పోరులో 2.5-1.5తో జార్జియాపై గెలిచి టోర్నీ తుదిపోరులో నిలిచి కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది. తెలుగు గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక 43 ఎత్తుల్లో డనిజెపై గెలువగా, బసిషిల్విని వైశాలి 43 ఎత్తుల్లో చిత్తు చేసింది. మూడో గేమ్లో తానియా సచ్దేవ్ గెలువగా, మేరీఆన్ గోమ్స్ ఓడినా భారత్ ముందంజ వేసింది. శనివారం జరిగే ఫైనల్లో రష్యాతో భారత్ తలపడుతుంది. 2007లో మొదలైన ఈ మెగాటోర్నీలో టీమ్ఇండియా ఇప్పటివరకు పతకం దక్కించుకోలేదు.