ఇంగ్లండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. తొలి రెండు మ్యాచులను వరుసగా 50, 49 పరుగుల తేడాతో ఖాతాలో వేసుకుంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింట్లోనూ సత్తా చాటుతూ అదరగొడుతోంది. ఈ క్రమంలో వచ్చే టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఫేవరెట్గా బరిలో దిగుతుందని పాకిస్తాన్ మాజీ సారధి షాహిద్ అఫ్రిదీ అభిప్రాయపడ్డాడు.
‘‘భారత జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసింది. ఈ సిరీస్ విజయానికి వాళ్లు నిజంగా అర్హులు. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్లో కూడా ఫేవరెట్లలో భారత్ కూడా కచ్చితంగా ఒకటి’’ అని అఫ్రిదీ ట్వీట్ చేశాడు. కాగా, మూడు టీ20ల సిరీస్లో వరుసగా రెండు మ్యాచులు గెలిచిన భారత్.. ఆదివారం నాడు మూడో టీ20లో తలపడుతుంది. ఈ మ్యాచ్లో కూడా గెలిచి ఎలాగైనా ఈ సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది.