Under 19 World Cup | వచ్చే ఏడాది జరిగే అండర్-19 వరల్డ్ కప్ టోర్నమెంట్కు బీసీసీఐ ఆదివారం 17 మంది సభ్యుల టీమ్ను ప్రకటించింది. వచ్చేనెల 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు వెస్టిండీస్లో ఈ టోర్నీ జరుగనున్నది. ఢిల్లీ బ్యాట్స్మన్ యశ్ దుల్ను సారథిగా, ఎస్కే రషీద్ను వైస్ కెప్టెన్గా నియమించింది బీసీసీఐ. 14వ యూ-19 వరల్డ్ కప్ టోర్నీలో 16 జట్లు 48 మ్యాచ్లు ఆడతాయి.
ఇప్పటి వరకు నాలుగు దఫాలు ఐసీసీఐ యూ-19 వరల్డ్ కప్ను టీం ఇండియా గెలుచుకున్నది. 2000, 2008, 2012, 2018ల్లో టీం ఇండియా టైటిల్ కైవశం చేసుకున్నది. 2016లోనూ రన్నరప్గా నిలిచింది. ఇంతకుముందు 2020లో న్యూజిలాండ్లో ఈ టోర్నీ జరిగింది. టీం ఇండియా గ్రూప్-బీలో ఆడనున్నది.