బెంగళూరు: దేశవాళీ పేసర్ ముఖేశ్ కుమార్ మూడు వికెట్లతో సత్తాచాటడంతో న్యూజిలాండ్-‘ఎ’తో జరుగుతున్న నాలుగురోజుల అనధికారిక టెస్టులో భారత్-‘ఎ’కు మెరుగైన ఆరంభం లభించింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్.. గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 156 పరుగులు చేసింది. జో కార్టర్ (73 బ్యాటింగ్) టాప్ స్కోరర్ కాగా.. ఏ స్థాయి క్రికెట్లోనైనా జాతీయ జట్టుకు తొలిసారి ప్రాతినిధ్యం వహించిన ముఖేశ్ తన పేస్తో ఆకట్టుకున్నాడు. యష్ దయాల్, అర్జాన్ నాగ్వస్వల్లా చెరో వికెట్ పడగొట్టారు. వెలుతురులేమి కారణంగా తొలి రోజు 61 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.