గాలె: శ్రీలంక పర్యటనలో అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్న భారత్-ఏ రెండో రోజు భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ధృవ్ జురెల్ (141 నాటౌట్) అజేయ సెంచరీతో కదంతొక్కగా తొలి ఇన్నింగ్స్ను భారత్ 452/6 వద్ద డిక్లేర్డ్ చేసింది.
షేక్ రషీద్ (63) రాణించాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన శ్రీలంక-ఏ.. శుక్రవారం ఆట చివరికి 31 ఓవర్లలో 113/2తో నిలిచింది.