హోచిమిన్ సిటీ: అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్లో భారత్కు చుక్కెదురైంది. మంగళవారం వియత్నాంతో జరిగిన మ్యాచ్లో భారత్ 0-3 తేడాతో ఓటమిపాలైంది. ర్యాంకింగ్స్ పరంగా తమ(97) కంటే తక్కువ ర్యాంక్లో ఉన్న భారత్(104)పై వియత్నాం పూర్తి పైచేయి సాధించింది.
ఆద్యంతం పూర్తి ఆధిపత్యం కనబరిచిన మ్యాచ్లో వియత్నాం తరఫున ఫాన్వాన్ డక్(10ని), న్యుగెన్ వాన్తోన్(49ని), నుగెన్ వాన్ క్యుయెట్(70ని) గోల్స్ చేశారు. మ్యాచ్ ప్రథమార్ధంలో అంతోఇంతో పోటీనిచ్చిన టీమ్ఇండియా కీలకమైన ద్వితీయార్ధంలో పూర్తిగా తేలిపోయింది. టోర్నీలో రెండు మ్యాచ్లు గెలిచిన వియత్నాం విజేతగా నిలిచింది.