హైదరాబాద్: మహిళల ప్రపంచకప్లో (Women’s World Cup ) భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత మహిళల జట్టు తడబడుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు మొదట్లో గట్టిదెబ్బ తగిలింది. రెండో ఓవర్లోనే స్టార్ బాటర్ షఫాలీ వర్మ డకౌట్ అయింది. దీంతో 4 పరుగులకే వికెట్ కోల్పోయిన జట్టును దీప్తి శర్మ, స్మృతి మందన ఆదుకున్నారు. అయితే కొన్ని పరుగుల తేడాతోనే వారిద్దరు ఔటవడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సీనియర్ బ్యాటర్లు మిథాలీ రాజ్ (9), హర్మన్ప్రీత్ కౌర్ (5) స్కోర్ చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. తర్వత వచ్చిన మిడిలార్డర్ బ్యాటర్ రిచా గోష్ (1) కూడా ఎక్కువసేపు నిలువలేదు. 114 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్లోకి వచ్చిన పూజా వత్సార్కర్ బ్యాట్ ఝులిపించింది.
పూజా (43 బంతుల్లో 43)కు స్నేహ్ రాణా (33 బంతుల్లో 33) జతకావడంతో భారత్ స్కోర్బోర్డు పరుగులు పెడుతున్నది. టాప్ ఆర్డర్ను కట్టడిచేసిన పాక్ బౌలర్లపై ఈ ఇద్దరు బ్యాటర్లు ఎదురుదాడికి దిగారు. దీంతో భారత్ 44 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది.