జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో భారత యువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు శిఖర్ ధవన్ (40), కేఎల్ రాహుల్ (30) శుభారంభం అందించారు. అయితే రాహుల్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడకుండానే అవుటవగా.. ధవన్ కూడా కాసేపటికే పెవిలియన్ బాటపట్టాడు. ఇలాంటి సమయంలో శుభ్మన్ గిల్ (100 నాటౌట్), ఇషాన్ కిషన్ (50) నిలకడగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు.
ఈ క్రమంలోనే 42వ ఓవర్లో కిషన్ వన్డేల్లో తన రెండో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే రనౌట్ అయిన అతను.. పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ చివరి బంతికి దీపక్ హుడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఎండ్లో ఉన్న శుభ్మన్ గిల్కు సంజూ శాంసన్ జతకలిశాడు. ఈ క్రమంలో ఎటువంటి తడబాటు ప్రదర్శించకుండా ఆడిన గిల్.. సింగిల్తో తన మొదటి అంతర్జీతీయ సెంచరీ నమోదు చేశాడు.
1st Hundred 💯💥🔥 Of Shubman Gill 😎
Born Of New Superstar Of India.
What a Inning. 👌👌👌
Well Deserved 💯More Yet To Come…#ShubmanGill #INDvsZIM #ZIMvIND #Gill pic.twitter.com/uq8o8Ws7JE
— Shubham Jaiswal (@Shubh_jswl) August 22, 2022