భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో జింబాబ్వే జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఇన్నొసెంట్ కాయా (6) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ కైటాన్ (12) రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడాడు. ఇలాంటి సమయంలో జట్టును ముందుండి నడిపించిన వెటరన్ బ్యాటర్ షాన్ విలియమ్స్ (45)ను అక్షర్ పటేల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
అక్షర్ వేసిన బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన విలియమ్స్ మిస్ అయ్యాడు. దాంతో ఆ బంతి అతని ప్యాడ్లను తాకింది. ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేయగా.. అంపైర్ మరో ఆలోచన లేకుండా అవుట్ ఇచ్చాడు. విలియమ్స్ కూడా రివ్యూ కోరకుండానే నిరాశగా మైదానం వీడాడు. దీంతో 17 ఓవర్లకు జింబాబ్వే రెండు వికెట్ల నష్టానికి 83 పరుగులతో నిలిచింది.