బెంగళూరులో జరుగుతున్న డే/నైట్ టెస్టులో భారత బ్యాటర్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన బ్యాటర్లతో పాటు రవీంద్ర జడేజా (4) రవిచంద్రన్ అశ్విన్ (13), అక్షర్ పటేల్ (9) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఇలాంటి సమయంలో యువకెరటం శ్రేయాస్ అయ్యర్ (65 నాటౌట్) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
మరో ఎండ్ నుంచి ఎటువంటి సహకారం అందకపోయినా తను మాత్రం చూడచక్కటి షాట్లతో అలరిస్తూ అర్ధశతకం సాధించాడు. ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. భారత ఇన్నింగ్స్లో శ్రేయాస్ ఇన్నింగ్సే హైలైట్ అనడం అతిశయోక్తి కాదు. ప్రస్తుతం శ్రేయాస్తోపాటు సమీ క్రిజులో ఉన్నాడు. శ్రేయాస్ పోరాటంతో 52 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 221/8 స్కోరుతో నిలిచింది.