స్పిన్నర్లకు అనుకూలించే పిచ్పై భారత పేసర్లు చెలరేగారు. లంక టాపార్డర్ను తుత్తునియలు చేశారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ చెరో రెండు వికెట్లతో చెలరేగారు. వీరికితోడు అక్షర్ పటేల్ కూడా ఒక వికెట్తో సత్తా చాటాడు. వీరి ధాటికి లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్ (2), దిముత్ కరుణరత్నే (4), లాహిరు తిరిమానే (8), ధనంజయ డిసిల్వ (10), చరిత్ ఆసలంక (5) పరుగులకే పెవిలియన్ చేరారు.
వెటరన్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ (25 నాటౌట్) మాత్రమే పోరాడుతున్నాడు. ప్రస్తుతం అతనితోపాటు క్రీజులో నిరోషన్ డిక్కవెల్ల ఉన్నాడు. అక్షర్ పటేల్ వేసిన బంతిని ముందుకొచ్చి భారీషాట్ ఆడేందుకు ఆసలంక ప్రయత్నించాడు. కానీ దాన్ని ముందే ఊహించిన అక్షర్ అతని ప్యాడ్లవైపు బంతి వేశాడు.
లయ తప్పానని గ్రహించిన తర్వాత కూడా ఆసలంక భారీ షాట్ ఆడాడు. దీంతో బాగా ఎత్తుగా గాల్లోకి లేచిన బంతిని మిడాఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న అశ్విన్ అందుకున్నాడు. దీంతో లంక జట్టు 50 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.