IND vs SL : రెండో టీ20ల్లో టీమిండియా కష్టాల్లో పడింది. శ్రీలంక బౌలర్లు విజృంభించడంతో పది ఓవర్ల లోపే సగం వికెట్లు కోల్పోయింది. 11 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. తొలి మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన దీపక్ హుడా (9) ఐదో వికెట్గా వెనుదిరిగాడు. హసరంగ బౌలింగ్లో అతను బౌల్డ్ అయ్యాడు. బౌండరీలు బాది ఒత్తిడి తగ్గిద్దాం అనుకున్న హార్దిక్ పాండ్యా (12)ను కరుణరత్నే 12 పరుగులకే పెవిలియన్ పంపించాడు. రజత ఒకే ఓవర్లో ఓపెనర్లు ఇషాన్, శుభ్మన్ గిల్ను పెవిలియన్ పంపి టీమిండియాను దెబ్బకొట్టాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ 27, అక్షర్ పటేల్ 8 పరుగులతో ఆడుతున్నారు.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ దసున్ శనక అర్థ సెంచరీ(56) చేశాడు. కుశాల్ మెండిస్ (54), ప్రథుమ్ నిస్సంకా (33) అసలంక( 37) రాణించారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు, చాహల్ రెండు వికెట్లు పడగొట్టారు. యజువేంద్ర చాహల్కు ఒక వికెట్ దక్కింది.