సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్కు అదిరే ఆరంభం లభించింది. 296 పరుగుల భారీ లక్ష్యఛేదనలో కెప్టెన్ కేఎల్ రాహుల్ (12)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన శిఖర్ ధావన్ (39 నాటౌట్) బౌండరీలతో దుమ్మురేపాడు.
దీంతో భారత జట్టు కేవలం పది ఓవర్లలోనే 55/1 స్కోరు సాధించింది. అయితే ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఎయిడెన్ మార్క్రమ్ బౌలింగ్లో రాహుల్ అవుటయ్యాడు. ఆఫ్స్టంప్ ఆవల పడిన లెంగ్త్ బాల్ను ఆడేందుకు రాహుల్ ప్రయత్నించాడు.
ఈ క్రమంలో అవుట్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని వికెట్ కీపర్ డీకాక్ చక్కగా అందుకోవడంతో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. రాహుల్ అవుటవడంతో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. పది ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 55/1 స్కోరుతో నిలిచింది.