సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. వీళ్లిద్దరూ చాలా సంయమనంతో ఆడి 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత మయాంక్ (60) అవుటయ్యాడు. ఇలా తొలివికెట్కు భారత ఓపెనర్లు వందపైగా భాగస్వామ్యం నెలకొల్పి 11 ఏళ్లు గడిచిపోయాయి.
చివరగా వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ ఇద్దరూ కలిసి 2010 డిసెంబరులో తొలి వికెట్కు 100 పరుగులపైగా ఓపెనింగ్ భాగస్వామ్యం అందించారు. ఈ మ్యాచ్లో వెటరన్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా (0) మరోసారి పూర్తిగా నిరాశపరిచాడు. తొలి బంతికే గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ కూడా నిలకడగా ఆడుతున్నాడు. 57 ఓవర్లకు రెండో సెషన్ ముగిసే సమయానికి కేఎల్ రాహుల్ (68 నాటౌట్), విరాట్ కోహ్లీ (19 నాటౌట్) క్రీజులో ఉన్నారు. టీకి వెళ్లే సరికి భారత స్కోరు 157/2గా ఉంది.