భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో సౌతాఫ్రికా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తోంది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే ఓపెనర్ జానెమన్ మలాన్ (6)ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. దీంతో క్వింటన్ డీకాక్(27), కెప్టెన్ టెంబా బవుమా (43 నాటౌట్) కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే అశ్విన్ బుట్టలో పడిన డీకాక్.. 27 పరుగులకు పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత వచ్చిన ఎయిడెన్ మార్క్రమ్ (4) కూడా క్రీజులో ఎక్కువసేపు నిలవలేదు. అశ్విన్ బౌలింగ్ వేసిన 18వ ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ వేసిన అద్భుతమై త్రోకు రనౌట్గా పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన రాసీ వాన్ డర్ డస్సెన్ (29 నాటౌట్) వేగంగా ఆడుతున్నాడు. నిలకడగా ఆడుతున్న బవుమాకు డర్ డస్సెన్ తోడవడంతో సఫారీ స్కోరుబోర్డు వేగం పుంజుకుంటోంది. 25 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా జట్టు 118/3 స్కోరు తో నిలిచింది.