భారత్తో జరుగుతున్న తొలి టీ20లో సఫారీల కష్టాలకు అంతం లేకుండా పోయింది. అప్పటికే ఆరు వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా పయనిస్తున్న ఆ జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించిన వేన్ పార్నెల్ (24) కూడా అవుటయ్యాడు. అక్షర్ పటేల్ వేసిన 16వ ఓవర్లో బౌండరీ బాదిన పార్నెల్ మరో బౌండరీ బాదేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో గాల్లోకి లేచిన బంతిని డీప్ మిడ్ వికెట్లో సూర్యకుమార్ పట్టేశాడు. దీంతో సఫారీ జట్టు 16 ఓవర్లకు 72/7 స్కోరుతో నిలిచింది.