నాలుగో టీ20లో సౌతాఫ్రికా విజయావకాశాలు దాదాపు ఆవిరైపోయాయి. ఆరంభం నుంచే బ్యాటింగ్ చేయడానికి తడబడుతూ ఉన్న ఆ జట్టులో ఒక్కరంటే ఒక్క బ్యాటర్ కూడా భారత బౌలింగ్ దళాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోలేకపోయారు. ప్రమాదకరమైన మిల్లర్ (9)ను హర్షల్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
దీంతో ఇన్నింగ్స్ నిర్మించాల్సిన బాధ్యతను భుజాలకెత్తుకున్న రాసీ వాన్ డర్ డస్సెన్ (20)ను ఆవేష్ ఖాన్ అవుట్ చేశాడు. మార్కో జాన్సెన్ (12 నాటౌట్)తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడిన అతను.. 14వ ఓవర్లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో డీప్ మిడ్ వికెట్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్కు చిక్కాడు. దాంతో 74 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన సఫారీలు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు.
అదే ఓవర్ నాలుగో బంతికి మార్కో జాన్సెన్ (12) కూడా అవుటయ్యాడు. అంతకుముందు బంతికే ఆవేష్ వేసిన బౌన్సర్.. జాన్సెన్ తలకు తగిలింది. ఆ కసితో మరుసటి బంతిని బౌండరీ దాటించేందుకు ప్రయత్నించిన ఈ పేసర్.. డీప్ మిడ్ వికెట్లో గైక్వాడ్కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.