సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఈ ఒక్కరోజులోనే మొత్తం 18 వికెట్లు పడ్డాయి. వీటన్నింటినీ పేసర్లే తీశారంటేనే పిచ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మూడో రోజు ఆట చివర్లో నైట్ వాచ్మెన్గా పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను భారత జట్టు పంపింది.
నాలుగో రోజు ఆట మొదలైన కాసేపటికే అతను పెవిలియన్ చేరాడు. వెటరన్ పేసర్ రబాడ వేసిన బౌలింగ్లో శార్దూల్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి.. మూడో స్లిప్ ముల్డర్చేతుల్లోకి వెళ్లింది. దీంతో నైట్వాచ్మెన్ శార్దూల్ ఇన్నింగ్స్ ముగిసింది.
అతని తర్వాత ఛటేశ్వర్ పుజారా క్రీజులోకి వచ్చాడు. తొలి ఇన్నింగ్స్లో గోల్డెన్ డక్గా వెనుతిరిగిన పుజారా.. ఈ ఇన్నింగ్స్లో అయినా సత్తా చాటుతాడేమో చూడాలి.