వాండరర్స్ టెస్టులో శార్దూల్ ఠాకూర్ షో ముగిసింది. బౌలింగ్లో ఏడు వికెట్లతో అదరగొట్టిన శార్దూల్.. బ్యాటింగ్లో కూడా ధనాధన్ షాట్లతో విరుచుకుపడ్డాడు. జాన్సెన్ వేసిన ఇన్నింగ్స్ 50వ ఓవర్లో సిక్స్, ఫోర్, ఫోర్ బాదాడు. కేవలం 24 బంతుల్లోనే 28 పరుగులు చేసిన శార్దూల్ మరింత రెచ్చిపోయేలా కనిపించాడు.
అయితే అదే ఓవర్లో షార్ట్ బాల్కు వికెట్ పోగొట్టుకున్నాడు. ఆ బంతికి కూడా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు కానీ.. బాల్ నేరుగా డప్ స్క్వేర్ లెగ్ ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో శార్దూల్ సూపర్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ వికెట్తో భారత జట్టు 225/7 స్కోరుతో నిలిచింది.
అయితే క్రీజులో ఉన్న హనుమ విహారి ఇంకా నెమ్మదిగానే ఆడుతుండటంపై అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు. శార్దూల్ అవుటైన కాసేపటికే షమీ (0) కూడా పెవిలియన్ చేరాడు. లెంగ్త్ బా్ను ఆడేందుకు ప్రయత్నించిన అతను వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.