వాండరర్స్ టెస్టులో భారత్కు గౌరవప్రదమైన స్కోరు అందించేందుకు టెయిలెండర్లు కష్టపడుతున్నారు. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (50) తప్ప మిగతా బ్యాటర్లెవరూ ప్రభావం చూపని చోట అశ్విన్ పోరాడుతున్నాడు. ధాటిగా ఆడుతూ భారత్కు తొలి ఇన్నింగ్సులో కనీసం 200 పరుగులు అందించేందుకు కష్టపడుతున్నాడు.
అయితే అతనికి అవతలి ఎండ్ నుంచి సహకారం కరువైంది. పంత్ (17), శార్దూల్ (0), షమీ (9) పరుగులు చేసి అవుటయ్యారు. మహమ్మద్ షమీ కొంత ఫర్వాలేదన్నట్లే కనిపించాడు. కానీ వెటరన్ పేసర్ రబాడ బౌలింగ్లో స్ట్రెయిట్ షాట్ కొట్టి అతనికే క్యాచ్ ఇచ్చాడు.
షమీ స్ట్రెయిట్ డ్రైవ్ను చటుక్కున అందుకున్న రబాడ.. అతన్ని పెవిలియన్ చేర్చాడు. దీంతో 185 పరుగుల వద్ద భారత జట్టు 8వ వికెట్ కోల్పోయింది. షమీ అవుటవడంతో బుమ్రా క్రీజులోకి వచ్చాడు. అశ్విన్ (44 నాటౌట్) హాఫ్ సెంచరీ చేరువలో ఉన్నాడు.