భారత స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన రికార్డు సాధించాడు. సఫారీలతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్సులో పంత్ సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో పంత్ చివరి వరకూ నాటౌట్గా నిలిచాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇది పంత్ కెరీర్లో నాలుగో టెస్టు సెంచరీ. అంతేకాదు, సఫారీ గడ్డపై సెంచరీ బాదిన ఏకైక భారత వికెట్ కీపర్గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు, సౌతాఫ్రికాలో పర్యటించిన ఏ ఆసియన్ జట్టు వికెట్ కీపర్ కూడా ఇక్కడ సెంచరీ చేయలేదు.
ఇప్పటి వరకూ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన 90 పరుగులే వికెట్ కీపర్లలో అత్యధిక స్కోరు. దీన్ని పంత్ దాటేశాడు. దీంతో ఒక ఎలైట్ క్లబ్కు పునాదులు వేశాడు. అంతేకాదు, ఇప్పటి వరకూ పంత్ చేసిన నాలుగు టెస్టు సెంచరీల్లో మూడు విదేశాల్లోనే రావడం గమనార్హం.