నిర్లక్ష్యమైన షాట్లు ఆడుతూ విఫలమవుతున్న రిషభ్ పంత్.. సెంచరీతో ఆకట్టుకున్నాడు. కోహ్లీ అవుటైన తర్వాత భారత బ్యాటింగ్ లైనప్ మరోసారి గాడితప్పింది. అయినా సరే తన పాత్ర చక్కగా పోషించేందుకు ప్రయత్నించిన అతను టెయిలెండర్లతో కలిసి స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. తనను టెస్టు జట్టు నుంచి తప్పించాలంటున్న విమర్శకులకు బ్యాటుతో సమాధానం చెప్పాడు. ఈ టెస్టు మ్యాచ్లో పంత్ ఇన్నింగ్సే హైలైట్ అనడం అతిశయోక్తేమీ కాదు.
మూడోరోజు ఆటలో వెంటవెంటనే రెండు వికెట్లు పోవడంతో.. మరో వికెట్ పడకుండా అడ్డుగోడలా కోహ్లీ నిలబడ్డాడు. అతను అవుటైన తర్వాత మరెవరూ కనీసం బ్యాటింగ్ కూడా చేయలేదు. అశ్విన్ (7), శార్దూల్ (5), ఉమేష్ (0), షమీ (0) నిరాశపరిచారు. ఉమేష్ లానే పది బంతులు ఆడిన షమీ.. జాన్సెన్ బౌలింగ్లో బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించి అవుటయ్యాడు.
దీంతో 189 పరుగుల వద్ద భారత జట్టు 9వ వికెట్ కోల్పోయింది. కనీసం 250 పరుగుల ఆధిక్యం ఉంటే గెలుపు తథ్యమని నిపుణులు చెప్తుండగా.. భారత్ ఇంకా 193 పరుగుల ఆధిక్యంలోనే ఉంది. భారత్ను ఆలౌట్ చేయడానికి సఫారీలకు మరో రెండు వికెట్లు చాలు. ఈలోపు పంత్ దూకుడుగా ఆడి భారత్ను గట్టెక్కిస్తాడేమో చూడాలి.