కొంతకాలంగా అత్యంత పేలవ ఫామ్తో బాధపడుతున్న వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే.. మరో ప్లాప్ షో చూపించాడు. సౌతాఫ్రికా టెస్టు తొలి ఇన్నింగ్స్లో చాలా నిబద్ధతో ఆడిన అతను.. రెండో ఇన్నింగ్స్లో వచ్చీరావడంతోనే బౌండరీలు బాదాడు. దీంతో అతనిలో ఆత్మవిశ్వాసం ఉందని అంతా అనుకున్నారు.
అయితే జాన్సెన్ బౌలింగ్లో తనకు సమస్యగా మారిన హుక్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి డీప్ స్క్వేర్ లెగ్లో వాన్ డర్ డస్సెన్కు క్యాచ్ ఇచ్చాడు. న్యూజిల్యాండ్తో సిరీస్లో కూడా ఈ షాట్ రహానేకు సమస్యగా మారిన సంగతి తెలిసిందే.
దీంతో 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రహానే పెవిలియన్ చేరాడు. భారత జట్టు 111/6తో నిలిచింది. ప్రస్తుతం పంత్, అశ్విన్ క్రీజులో ఉన్నారు.