భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో సఫారీ పేసర్లు మరోసారి విజృంభించారు. బాధ్యతలను చక్కగా పంచుకున్న సఫారీ పేస్ దళం.. భారత బ్యాటర్లను చాలా ఇబ్బంది పెట్టింది. దీంతో భారీ స్కోరు చేస్తుందనుకున్న భారత్.. 174 పరుగులకే చాపచుట్టేసింది. భారత బ్యాటర్లలో రాహుల్ (23), మయాంక్ (4), శార్దూల్ ఠాకూర్ (10), పుజారా (16), కోహ్లీ (18), రహానే (20), పంత్ (34), అశ్విన్ (14) పరుగులు చేశారు.
చివర్లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన పంత్.. రబాడ వేసిన షార్ట్ పిచ్ బంతిని ఆడే సమయంలో షాట్ ఎంపికలో కొంచెం ఆలస్యమవడంతో అతను వికెట్ పోగొట్టుకోవాల్సి వచ్చింది. భారీ షాట్ ఆడే ఉద్దేశ్యంతో ముందుకొచ్చిన పంత్.. రబాడ షార్ట్ పిచ్ బాల్ వేయడంతో కొంత సందేహించాడు.
పుల్ చేయాలా? వద్దా? అనే సంశయంలోనే పుల్ షాట్ ఆడాడు. కొంచెం ఆలస్యమవడంతో సరిగ్గా బంతిని బాదలేకపోయాడు. దీంతో మిడాన్లో ఉన్న ఎన్గిడీకి సులభమైన క్యాచ్ దక్కింది. వన్డేను తలపిస్తూ పంత్ ఆడిన 34 పరుగుల ఇన్నింగ్స్కు అలా తెరపడింది.
కాసేపటికే మహమ్మద్ షమీ (1) కూడా పెవిలియన్ బాట పట్టాడు. రబాడ బౌలింగ్లో షమీ బ్యాట్ లీడింగ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని ఫస్ట్ స్లిప్లో ముల్డర్ అందుకున్నాడు.
షమీ వెనుతిరగడంతో క్రీజులోకి వచ్చిన సిరాజ్.. ఐదు బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. దీంతో భారత జట్టు 174 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా ముందు 305 పరుగుల టార్గెట్ నిలిచింది. సఫారీ బౌలర్లలో జాన్సెన్, రబాడ చెరో నాలుగు వికెట్లు తీసుకున్నారు. ఎన్గిడీ రెండు వికెట్లు పడగొట్టాడు.