భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20కి అంతరాయం ఏర్పడింది. సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక ఫ్లడ్ లైట్స్ టవర్ పూర్తిగా ఆగిపోయింది. దీంతో అది సరి చేసే వరకు మ్యాచ్కు ఆగిపోనుంది. ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే తమ తమ డగౌట్ చేరుకొని మ్యాచ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికి మరమ్మతు చర్యలు జరుగుతున్నాయని అధికారులు చెప్పారు.
అంతకుముందు భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా మ్యాచ్కు ఒకసారి అంతరాయం కలిగింది. మైదానంలోకి ఒక పాము రావడంతో ఆటను నిలిపివేశారు. స్టేడియం నిర్వాహకులు దాన్ని పట్టుకున్న తర్వాత మ్యాచ్ను ప్రారంభించడం జరిగింది.
కాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు 237/3 స్కోరు చేసింది. సౌతాఫ్రికాపై భారత్కు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. లక్ష్య ఛేదనలో అర్షదీప్ సింగ్ తను వేసిన మొదటి ఓవర్లోనే సఫారీ సారధి బవుమా (0), రైలీ రూసో (0) ఇద్దరినీ డకౌట్లుగా పెవిలియన్ చేర్చాడు.