సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. ఆఫ్స్టంప్ ఆవల వెళ్తున్న బంతిని ఆడేందుకు ప్రయత్నించి అవుటయ్యాడు. ఇలా కోహ్లీని బోల్తా కొట్టించిన బౌలర్ మార్కో జాన్సెన్.
ఈ మ్యాచ్లోనే సౌతాఫ్రికా తరఫున జాన్సెన్ అరంగేట్రం చేశాడు. అయితే గతంలో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు కూడా కోహ్లీకి జాన్సెన్ బౌలింగ్ చేశాడు. కాకపోతే అది నెట్స్లో. 2018లో కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే.
ఆ సమయంలో నెట్స్లో శ్రమిస్తున్న కోహ్లీకి.. జాన్సెన్ బౌలింగ్ చేశాడు. అప్పుడు కోహ్లీతో కలిసి ఫొటో కూడా దిగాడు. ఇప్పుడు ఇరుదేశాల మధ్య జరుగుతున్న టెస్టులో అరంగేట్ర మ్యాచ్లోనే కోహ్లీ వికెట్ తీసి శభాష్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలో అప్పట్లో కోహ్లీ, జాన్సెన్ కలిసి దిగిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.