కేప్టౌన్ వన్డేలో భారత జట్టు ఇబ్బందుల్లో పడింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (9) స్వల్ప స్కోరుకే వెనుతిరగడంతో షాకైన టీమిండియాను శిఖర్ ధావన్ (61) ఆదుకున్నాడు. మాజీ సారధి విరాట్ కోహ్లీ (64 నాటౌట్)తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు.
అయితే పెహ్లుక్వేయా బౌలింగ్లో షార్ట్ పిచ్ బంతికి ధావన్ బోల్తా కొట్టాడు. హుక్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమవడంతో ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ డీకాక్ సులభంగా అందుకున్నాడు. దీంతో ధావన్ ఇన్నింగ్స్ ముగిసింది.
లెఫ్ట్ హ్యాండర్ అవుటవడంతో మరో లెఫ్టీ పంత్ను ముందుగా దింపారు. ఎదుర్కొన్న తొలి బంతికే ముందుకొచ్చి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన పంత్.. కవర్స్లో మగాలకు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్గా వెనుతిరిగాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (13 నాటౌట్)తో కలిసి కోహ్లీ జట్టును ముందుకు నడిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్నాడు. ప్రస్తుతం భారత జట్టు 30 ఓవర్లకు 152/3 స్కోరుతో నిలిచింది.