భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఒక పక్క హనుమ విహారి (20 నాటౌట్) ఉన్నప్పటికీ.. స్కోరును పెంచే బాధ్యతను తాను తీసుకున్న బుమ్రా భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. జాన్సెన్ వేసిన ఇన్నింగస్ 55వ ఓవర్లో సిక్స్ కొట్టాడు.
ఆ తర్వాత 57వ ఓవర్లో ఎన్గిడీ బౌలింగ్లో కూడా అదే మాదిరి ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బ్యాటర్కు చాలా దగ్గరగా వచ్చిన బంతి టాప్ ఎడ్జ్తీసుకొని పాయింట్ దిశగా గాల్లోకి లేచింది. దాన్ని జాన్సెన్ సులభంగా అందుకోవడంతో బుమ్రా ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో భారత జట్టు 245/9 స్కోరుతో నిలిచింది. ప్రస్తుతం భారత్ 218 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. క్రీజులో సిరాజ్, విహారి ఉన్నారు.