సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో ఫేవరెట్లుగా బరిలో దిగిన టీమిండియా.. వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఈ క్రమంలో జట్టు కూర్పుపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో భారత జట్టులో రెండు మార్పులు చేస్తే బాగుంటుందని టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు.
అదే సమయంలో భారత్ తరఫున నిరాశ పరుస్తున్న యువప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్కు మరో అవకాశం ఇవ్వాలని సూచించాడు. రెండో టీ20లో అతను ఆడిన షాట్ను తప్పుబట్టిన బంగర్.. భవిష్యత్తులో భారత్కు టాపార్డర్ బ్యాటర్గా రుతురాజ్ను భావిస్తున్నారని, కాబట్టి అతనికి మరొక అవకాశం ఇస్తే మంచిదని అన్నాడు.
ఇషాన్ కిషన్ తన స్థానం కాపాడుకుంటున్నాడని, కాబట్టి రుతురాజ్కు మరో అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే అక్షర్ పటేల్ స్థానంలో రవి బిష్ణోయిని ఆడించాలని సలహా ఇచ్చాడు. రెండు మ్యాచుల్లో కూడా అక్షర్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
ఈ క్రమంలో అతని స్థానంలో బిష్ణోయిని ఆడిస్తే మంచి ఫలితం ఉంటుందని బంగర్ వివరించాడు. అలాగే ఆవేష్ ఖాన్ బాగా బౌలింగ్ చేసినప్పటికీ.. అర్షదీప్ లేదా ఉమ్రాన్ను అతని స్థానంలో తీసుకోవాలని సూచించాడు. మరి విశాఖపట్టణం వేదికగా జరిగే మ్యాచ్లో టీమిండియా ఎలాంటి మార్పులు చేస్తుందో చూడాలి.