సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ అదరగొట్టాడు. కేఎల్ రాహుల్ (12)తో కలిసి ఓపెనింగ్ బాధ్యతలు తలకెత్తుకున్న ధావన్ అర్ధశతకంతో సత్తాచాటాడు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ధావన్ వేగంగా ఆడుతూ సౌతాఫ్రికాపై ఒత్తిడి పెంచాడు.
ఈ క్రమంలో స్వల్పస్కోరుకే రాహుల్ అవుటైనా తను మాత్రం ధాటిగానే ఆడాడు. దీంతో 14వ ఓవర్ చివరి బంతికి యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ కోసం అతను కేవలం 51 బంతులే తీసుకున్నాడు.