సఫారీలతో జరుగుతున్న టెస్టులో స్టార్ పేసర్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో రాసీ వాన్ డర్ డస్సెన్ వికెట్.. టెస్టుల్లో బుమ్రాకు 100వ వికెట్. కేవలం 23 మ్యాచుల్లోనే బుమ్రా వంద వికెట్ల క్లబ్లో చేరాడు.
డర్ డస్సెన్ అవుటవడంతో నైట్ వాచ్మెన్గా వచ్చిన కేశవ్ మహరాజ్ (8)ను కూడా బుమ్రా బంతికి వికెట్ పారేసుకున్నాడు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు 94/4తో నిలిచింది. లక్ష్యానికి ఇంకా 211 పరుగులు వెనకబడి ఉంది. సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గార్ (52 నాటౌట్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.
అయితే చివరిదైన ఐదో రోజున టెంబా బవుమా, డీకాక్ వంటి సీనియర్లు ఉండటంతో సౌతాఫ్రికా ప్రతిఘటన బలంగానే ఉండేలా కనిపిస్తోంది. అదే సమయంలో భారత పేసర్లు కూడా అద్భుతంగా రాణిస్తుండటంతో ఐదో రోజు ఆసక్తికరంగా మారనుంది. అయితే గురువారం నాడు సెంచూరియన్లో వర్షం పడే అవకాశం ఉండటంతో భారత అభిమానులు ఆందోళన పడుతున్నారు.