భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో సఫారీలు విజయం దిశగా పయనిస్తున్నారు. పేసర్లు విజృంభించడంతో భారత జట్టు 266 పరుగులకు ఆలౌటయింది. పుజారా (53), రహానే (58), విహారి (40 నాటౌట్) పరుగులతో రాణించారు. చివర్లో శార్దూల్ ఠాకూర్ (28) ధనాధన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు.
అనంతరం 240 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన సఫారీలకు కెప్టెన్ డీన్ ఎల్గార్ (46 నాటౌట్), మార్క్రమ్ (31) శుభారంభం అందించారు. ఈ జోడీని ఇన్నింగ్స్ 10వ ఓవర్లో శార్దూల్ విడగొట్టాడు. అతని బౌలింగ్లో మార్క్రమ్ ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కీగన్ పీటర్సన్ (28) కూడా ఫర్వాలేదనిపించాడు.
ఎల్గార్, పీటర్సన్ జోడీ ప్రమాదకరంగా మారుతున్న సమయంలో అశ్విన్.. భారత్కు బ్రేకిచ్చాడు. పీటర్సన్ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాసీ వాన్ డర్ డస్సెన్ (11 నాటౌట్) చాలా జాగ్రత్తగా ఆడుతున్నాడు. దీంతో మరో వికెట్ తీయడం భారత బౌలర్ల వల్ల కాలేదు.
వీళ్లిద్దరూ నిలకడగా ఆడుతుండటంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీలు 118/2 స్కోరుతో నిలిచారు. ఈ మ్యాచ్లో విజయం కోసం దక్షిణాఫ్రికాకు మరో 122 పరుగులు కావాలి. భారత్ గెలవాలంటే 8 వికెట్లు తీయాలి. మరి నాలుగో రోజు ఆట ఎలా సాగుతుందో చూడాలి.