పేస్కు స్వర్గధామంలా మారిన పిచ్పై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సత్తాచాటాడు. భారత పేసర్లు వికెట్ల కోసం కష్టపడుతున్న సమయంలో.. తను ముందుకొచ్చి కీలక వికెట్ తీశాడు. 240 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సౌతాఫ్రికా జట్టుకు కెప్టెన్ డీన్ ఎల్గార్ (** నాటౌట్), మార్క్రమ్ (31) మంచి ఆరంభం అందించారు.
ఈ జంటను శార్దూల్ ఠాకూర్ విడగొట్టాడు. అతని బౌలింగ్లో బంతిని సరిగా అంచనా వేయలేక మార్క్రమ్ వికెట్ పోగొట్టుకున్నాడు. ఎల్బీగా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కీగన్ పీటర్సన్ కూడా భారత బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. చాలా జాగ్రత్తగా ఆడుతూ కెప్టెన్కు సహకారం అందించాడు.
ఈ క్రమంలో 28వ ఓవర్ వేసేందుకు వచ్చిన అశ్విన్.. పీటర్సన్ను బోల్తా కొట్టించాడు. ఆఫ్స్టంప్ ఆవల అశ్విన్ వేసిన లెంగ్త్ బాల్.. షార్ప్గా టర్న్ అయింది. దాన్ని ఫ్లిక్ చేయడానికి పీటర్సన్ ప్రయత్నించాడు. కానీ విఫలమవడంతో బంతి అతని ప్యాడ్లను తాకింది.
భారత జట్టు అప్పీల్ చేయగా కొంచెం ఆలోచించిన అంపైర్ అవుట్గా ప్రకటించాడు. బంతి టర్న్ చూసి సౌతాఫ్రికా రివ్యూ కోరుతుందని అందరూ అనుకున్నారు. కానీ పీటర్సన్ రివ్యూ కోరకుండా పెవిలియన్ బాటపట్టాడు. దీంతో ప్రొటీస్ జట్టు 93 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.