మొట్టమొదటి సారి సెంచూరియన్లో సౌతాఫ్రికాను ఓడించిన టీమిండియా.. విజయానందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆటగాళ్లంతా తమకు తోచిన విధంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక వీడియో షేర్ చేశాడు.
హోటల్కు తిరిగొచ్చే సమయంలో తీసిన ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. ఈ వీడియోలో యువ పేసర్ మహమ్మద్ సిరాజ్, వెటరన్ ఛటేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్ ముగ్గురూ డ్యాన్సులు చేస్తూ కనిపించారు.
‘‘మ్యాచ్ అనంతరం తీసుకునే విక్టరీ ఫొటోషూట్ బోరింగ్గా మారింది. అందుకే ఈ విజయాన్ని మధుర జ్ఞాపకంగా మార్చాలని పుజారా చెప్పాడు. దీంతో పుజారా, సిరాజ్, నేను కాసేపు డ్యాన్సు చేశాం. నిజంగా ఎంత గొప్ప విజయం‘‘ అని అశ్విన్ పోస్టు చేశాడు.
కాగా, రెండో ఇన్నింగ్స్లో 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ను భారత బౌలర్లు 191 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో 113 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.