పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బ్యాటింగ్ తడబడుతోంది. ఆరంభంలోనే కేఎల్ రాహుల్ (0) డకౌట్ కాగా.. ఆ తర్వాత కాసేపు నిలబడిన కోహ్లీ (35), రోహిత్ (12) స్వల్ప వ్యవధిలోనే వెనుతిరిగారు. ఇలాంటి సమయంలో ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ (18)ను నసీమ షా క్లీన్ బౌల్డ్ చేశాడు. నసీమ్ డెలివరీని సరిగా అంచనా వేయలేకపోయిన సూర్య.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత జట్టు 89 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచింది.