భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ (14)ను రవి బిష్ణోయి తన తొలి ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. బిష్ణోయి వేసిన బంతిని మిడ్వికెట్ మీదుగా ఆడేందుకు బాబర్ ప్రయత్నించాడు. అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మకు నేరుగా క్యాచ్ వెళ్లింది. అయితే అది నోబాల్గా భావించిన అంపైర్ చెక్ చేశాడు. బిష్ణోయి మడగ భాగం క్రీజు గీతపై పడటంతో అతను బతికిపోయాడు. లేదంటే అది నోబాల్ అయ్యేదే. దీంతో బాబర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ జట్టు 22/1 స్కోరుతో నిలిచింది.