భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్కు శుభారంభం లభించింది. 182 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన పాకిస్తాన్కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రవి బిష్ణోయి బౌలింగ్లో బాబర్ ఆజమ్ (14) అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ధాటిగా ఆడిన రిజ్వాన్ (24 నాటౌట్), ఫఖర్ జమాన్ (6 నాటౌట్) రాణించారు. దాంతో పవర్ప్లే ముగిసే రికి పాకిస్తాన్ జట్టు 44/1 స్కోరుతో నిలిచింది.