IND Vs PAK | గత కొద్ది కాలంగా ఆసియాకప్, ప్రపంచ కప్ వేదికల విషయంలో భారత్ – పాక్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. పాక్లో జరిగే ఆసియా కప్లో భారత్ పాల్గొనకుంటే.. ప్రపంచ కప్ నుంచి వైదొలగుతామని పీసీబీ హెచ్చరించింది. అయితే, ఐసీసీ వార్నింగ్తో దారిలోకి వచ్చిన పాక్ బోర్డు.. ఆసియా కప్ను హైబ్రిడ్ మోడల్ను ఆడేందుకు అంగీకరించింది. ఇందులో భాగంగా పాక్ జట్టు మ్యాచ్లు మాత్రమే స్వదేశంలో జరుగనున్నాయి. మిగతా మ్యాచులన్నీ శ్రీలంకలో జరుగనున్నాయి. అయితే, ఆసియా కప్లో భారత్ జట్టు పాక్లో ఆడేందుకు రాకపోతే ప్రపంచకప్కు భారత్కు వెళ్లొద్దని మాజీలు రమీజ్ రాజాతో పాటు పలువురు మాజీలు డిమాండ్ చేశారు.
తాజాగా పాక్ క్రీడల మంత్రి సైతం భారత్కు పాక్ జట్టును పంపమన్నారు. తటస్థ వేదికపై ఆసియా కప్ నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుంటే.. వన్డే ప్రపంచక కప్ కోసం భారత్కు వెళ్లబోమని స్పష్టం చేశాడు. ఓ ఆంగ్ల న్యూస్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అహ్సన్ మజారీ మాట్లాడుతూ ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, పాక్ క్రికెట్ బోర్డు తన మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందన్న ఆయన.. భారత్ ఆసియా కప్ మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. ఆ దేశంలో జరిగే ప్రపంచకప్ మ్యాచ్ల విషయంలో తాము అదే డిమాండ్ చేస్తామని చెప్పారు. అయితే, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శనివారం ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
పాక్ ప్రధాని ఏర్పాటు చేసిన కమిటీకి విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కమిటీకి నేతృత్వం వహిస్తారని, ఇందులో భాగమైన 11 మంత్రుల్లో తాను ఒకడినని చెప్పారు. సమస్యపై చర్చించి పీసీబీ పోషకుడైన ప్రధానికి సిఫారసులను అందజేస్తామని, ఆ తర్వాత షరీఫ్ నిర్ణయం తీసుకుంటారన్నారు. పాక్ మంత్రి బీసీసీఐని టార్గెట్ చేస్తూ అసంబద్ధ ఆరోపణలు చేశారు. పాక్లో క్రికెట్ ఆడేందుకు భారత్ విముఖత వ్యక్తం చేయడం తనను బాధిస్తోందని, భారత్ క్రీడలను రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారన్నారు. భారత ప్రభుత్వం క్రికెట్ జట్టును ఎందుకు పాక్కు పంపడం లేదో తనకు అర్థం కావడం లేదన్నారు. కొంతకాలం కిందట భారత్ బేస్బాల్ టీం ఇస్లామాబాద్కు వచ్చిందని చెప్పారు.
పాక్ హాకీ, ఫుల్బాల్, చెస్ జట్లు భారతదేశానికి వెళ్తున్నాయన్నారు. అయితే, పాక్లో తమ జట్టు భద్రతపై బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. న్యూజిలాండ్, ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పాక్కు వచ్చాయని, అయితే.. భద్రత కేవలం సాకుమాత్రమేనని పాక్ మంత్రి ఆరోపించారు. ఇదిలా ఉండగా.. భారత్లో జరిగే వన్డ్ ప్రపంచకప్లో పాల్గొనేందుకు పీసీబీ చేసుకున్న ఒప్పందానికి సంబంధించి ఇటీవల పాక్కు రిమైండర్ పంపింది. ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైన తర్వాత పాక్ జట్టు ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియాతో జరిగే వేదికలను మార్చాలని డిమాండ్ చేసింది. దీన్ని ఐసీసీ, బీసీసీఐ తిరస్కరించాయి. ప్రపంచకప్లో ఆడేందుకు ఒప్పందం చేసుకుందని, తప్పక భారత్కు వస్తుందని ఆశిస్తున్నట్లు ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.