సూపర్-4లో భాగంగా భారత్తో జరిగిన టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో చివరకు విజయం పాక్నే వరించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. రోహిత్ శర్మ (28), కేఎల్ రాహుల్ (28), విరాట్ కోహ్లీ (60) రాణించడంతో 181/7 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో మహమ్మద్ రిజ్వాన్ (71), మహమ్మద్ నవాజ్ (42) రాణించడంతో పాకిస్తాన్ విజయం దిశగా సాగింది.
బాబర్ ఆజమ్ (14), ఫకర్ జమాన్ (15) నిరాశ పరిచారు. అయితే చివర్లో ఖుష్దిల్ షా (14 నాటౌట్), ఆసిఫ్ అలీ (16) ధాటిగా ఆడి ఆ జట్టుకు విజయం అందించారు. అయితే అర్షదీప్ సింగ్ వేసిన 20వ ఓవర్లో ఆసిఫ్ అలీ అవుటవడంతో క్రీజులోకి వచ్చిన ఇఫ్తికార్ అహ్మద్ (2 నాటౌట్) లాంఛనం పూర్తిచేశాడు.
దీంతో పాకిస్తాన్ జట్టు 19.5 ఓవర్లలో 182 పరుగులు చేసి ఐదు వికెట్ల తేడాతో విజయం తన ఖాతాలో వేసుకుంది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసుకున్నప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కట్టడిగా బౌలింగ్ చేసిన రవి బిష్ణోయి కూడా ఒక వికెట్ తీసుకున్నాడు.