దుబాయ్: పొట్టి ప్రపంచకప్ వచ్చేసింది. టీ20 ఫార్మాట్లో ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని టీమిండియా బలమైన జట్టుతో బరిలో దిగుతోంది. అక్టోబరు 24న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగే మ్యాచ్తో ఈ ప్రపంచకప్లో టీమిండియా ప్రస్థానం ప్రారంభమవుతుంది.
ఈ క్రమంలో టీమిండియాలో పాకిస్థాన్ జట్టుకు అత్యంత ప్రమాదకారి ఎవరు? అనే ప్రశ్నకు పాక్ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్గా నియమితుడైన ఆసీస్ దిగ్గజం మాథ్యూ హేడెన్ బదులిచ్చాడు. భారత జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ తమ జట్టుకు అత్యంత ప్రమాదకరమని హేడెన్ అన్నాడు.
పొట్టి క్రికెట్లో రాహుల్ ఆధిపత్యం చెలాయిస్తున్నాడని, అది కచ్చితంగా తమకు ప్రమాదకరమని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో రిషభ్ పంత్ కూడా తక్కువ కాదని చెప్పాడు. ఒక మీడియా సంస్థకు వర్చువల్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో హేడెన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
కాగా, కొన్నిరోజుల క్రితం ముగిసిన ఐపీఎల్లో కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 13 మ్యాచుల్లోనే 626 పరుగులు చేశాడు. అతను టీ20 ప్రపంచకప్లో కూడా అదే ఫామ్ కొనసాగించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
వారికి బదులిస్తున్నట్లు ప్రపంచకప్ అసలు సమరానికి ముందు జరిగిన రెండు వార్మప్ మ్యాచుల్లో రాహుల్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే.