కివీస్తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో భారత జట్టు కష్టాల్లో పడింది. మిడిలార్డర్ వైఫల్యంతో సతమతమవుతున్న టీమిండియాను ఈ మ్యాచ్లో కూడా ఇదే సమస్య దెబ్బతీసింది. ఓపెనర్లు రోహిత్ (56), ఇషాన్ కిషన్ (29) రాణించినా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (0), పంత్ (4) తీవ్రంగా నిరాశపరిచారు.
ఈ క్రమంలో జట్టును ఆదుకున్న వెంకటేశ్ అయ్యర్ (20), శ్రేయాస్ అయ్యర్ (25) జోడీ కాసేపు ఆశలు రేపింది. అయితే వెటర్ పేసర్ బౌల్ట్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి ఈ ఇద్దరూ కూడా పెవిలియన్ చేరారు. దీంతో 17 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 148/6 స్కోరుతో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో అక్షర్ పటేల్, హర్షల్ పటేల్ ఉన్నారు.